Ragidi Laxma Reddy, chairman of Madhura Charitable Trust, who performed eye operations and eye glasses.
కంటి ఆపరేషన్లు, కంటి అద్దాలు చేయించిన రాగిడి లక్ష్మారెడ్డి గారు
మధుర చారిటబుల్ ట్రస్ట్ వారి మెగా మెడికల్ క్యాంపులో కంటి పరీక్షలు నిర్వహించుకుని, ఆపరేషన్లు చేయించుకున్న వారందరికీ ఈరోజు చర్లపల్లి డివిజన్ పరిధిలో పంపిణీ కార్యక్రమానికి *మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ మధుర చారిటబుల్ ట్రస్ట్ రాగిడి లక్ష్మారెడ్డి గారి* సహకారం తో ట్రస్ట్ సభ్యులు, విచ్చేసి 30 మంది కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి మందులు , అలాగే 200 మందికి కంటి అద్దాలను వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ *మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి గారి* సహాయ సహకారాలతో మధుర చారిటబుల్ ట్రస్టు ద్వారా గత 20 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో కంటి ఆపరేషన్లు మరియు కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం, పేద మహిళలకు ఉపాధి లక్ష్యంగా కుట్టు మిషన్లు , అల్లికలు ఎంబ్రాయిడరీ వర్క్ శిక్షణ,ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పన కల్పించారు. రాబోవు రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఉదృతంగా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లో నిర్వహిస్తానని తెలియజేశారు.