24- Hour Service:

+917207934545 , +914079687716

Madhura Charitable Trust Chairman Ragidi Laxma Reddy inaugurated the free medical camp under the auspices of Madhura Charitable Trust as the chief guest.

మధుర చారిటబుల్ ట్రస్ట్ మరియు కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మేన్ రాగిడి లక్ష్మారెడ్డి గారు
👉 ఈ ఉచిత మెగా వైద్య శిబిరం సెయింట్ మార్క్స్ హైస్కూల్ బీరప్ప గడ్డ, ఉప్పల్ ,చిల్కానగర్ డివిజన్ లో నిర్వహించారు. భారీ ఎత్తున చిలుకానగర్ డివిజన్ వాసులు పాల్గొన్నారు..
👉 గత 25 సంవత్సరాలుగా *మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా* ఉప్పల్ నియోజకవర్గం లో అనేక రకాల ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్న *రాగిడి లక్ష్మా రెడ్డి గారు..
👉*ఈ మెగా క్యాంప్ లో జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఆప్తమాలజీ,విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు.
👉కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని *మధుర చారిటబుల్ ట్రస్ట్ వారు* సొంత ఖర్చుతో ఉచితంగా *ఉప్పల్ నియోజకవర్గం* ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తున్న *మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మా రెడ్డి గారు..
👉 ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి *మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,* *ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి గారు* మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గం లో అన్ని డివిజన్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని, మా ఈ ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉపాధి కల్పన ధ్యేయంగా కుట్టుమిషన్లు, అల్లికలు, ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, విద్యార్థులకు నోటు పుస్తకాలు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమానాలు విదేశీ చదువులకు ప్రోత్సాహకాలు అందిస్తూ, వారి భవిష్యత్తుకు బాటలు వేస్తూ మరెన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని తెలియజేశారు.
👉 పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి ప్రతిసారి సహకారం అందిస్తున్న *మధుర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులుకు* *కిమ్స్* యాజమాన్యానికి, వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
 

Leave A Comment