మధుర చారిటబుల్ ట్రస్ట్ మరియు కిమ్స్ హాస్పిటల్ , సాధురం కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మేన్ రాగిడి లక్ష్మారెడ్డి గారు

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి *మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,* *ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి గారు
మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గం లో అన్ని డివిజన్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని, మా ఈ ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉపాధి కల్పన ధ్యేయంగా కుట్టుమిషన్లు, అల్లికలు, ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, పేద విద్యార్థులకు పై చదువులు చదివే వారికి ఆర్థిక సాయం చేస్తూ, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు విదేశీ చదువులు చదువుకునే వారికి తోడ్పాటు అందజేస్తూ, నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించుట వంటి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని తెలియజేశారు.